ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2022-12-13T00:43:04+05:30

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్‌చార్జి సూర్యచంద్ర డిమాండ్‌ చేశారు.

తడిచిన వరి పొలాలను పరిశీలిస్తున్న జనసేన నాయకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాకవరపాలెం, డిసెంబరు 12: మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్‌చార్జి సూర్యచంద్ర డిమాండ్‌ చేశారు. సోమవారం జి.కోడూరులో వర్షాలకు తడిచిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి, నష్టపరిహారం జాబితాను కూడా తయారు చేయలేదన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఎక్కడా ఏర్పాటు చేయలేదన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేకుంటే అందోళన చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు కర్రి సురేష్‌, నాయకులు సేనాపతి శేషు, సంతోష్‌, అచ్చియ్యనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising