ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర

ABN, First Publish Date - 2022-07-02T06:29:16+05:30

సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్ర పట్టణంలో శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది.

రథయాత్రలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి టౌన్‌, జూలై 1 : సుభద్ర బలభద్ర సమేత జగన్నాథస్వామి రథయాత్ర పట్టణంలో శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద గల ఆలయంలో ఉదయం పది గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఉత్సవమూర్తులను రథంపై అధిష్ఠించారు. పూజల అనంతరం  రథోత్సవాన్ని 81వ వార్డు కార్పొరేటర్‌ పీలా లక్ష్మీసౌజన్య, వైసీపీ వార్డు ఇన్‌చార్జి పీలా రాంబాబు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల మీదుగా గూడ్స్‌షెడ్‌ వద్ద గల ఇంద్రజ్యమ్నహాల్‌కు రాత్రికి చేరుకుంది. దారిపొడవునా స్వామిని భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి మత్స్యవతారంలో స్వామివారిని అలంకరించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్వామికి పట్టువస్త్రాలు  సమర్పించారు.  పట్టణ ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-07-02T06:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising