ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుల్హన్‌ పథకానికి నిధులు లేవనడం సిగ్గు చేటు

ABN, First Publish Date - 2022-06-25T06:26:49+05:30

పేద మైనారిటీల వివాహాలకు సంబంధించిన దుల్హన్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనడం సిగ్గుచేటని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు.

విలేఖరులతో మాట్లాడుతున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త వీరసూర్యచంద్ర

నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 24: పేద మైనారిటీల వివాహాలకు సంబంధించిన దుల్హన్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనడం సిగ్గుచేటని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు. శుక్రవారం ఆయనిక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందన్నారు.  దుల్హన్‌ పథకానికి రూ.50 వేలు కాదు.. లక్ష ఇస్తామని ముస్లింలకు హామీ ఇచ్చి.. ఇప్పడు మొండిచేయి చూపడం సరికాదన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి ముస్లింలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఉన్నత చదువుల కోసం అందజేస్తున్న విద్యా పథకాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. ముస్లింలు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్‌రెడ్డిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వూడి చక్రవర్తి, రేగబల్ల శివ, రాజాన లవకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-06-25T06:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising