పీఆర్సీ జీవో ప్రతుల దహనం
ABN, First Publish Date - 2022-01-19T04:53:46+05:30
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం కలిగించేదిగా ఉందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
ఆరిలోవ, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి విడుదల చేసిన జీవో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం కలిగించేదిగా ఉందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఫ్యాప్టో పిలుపు మేరకు సాయంత్రం హనుమంతవాక కూడలిలో పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా నాయకులు టి.రామకృష్ణారావు, కె.శ్రీనివాసరావు, రామిరెడ్డి, దేముడుబాబు, మండల నాయకులు శ్యామ్కుమార్, బి.ముత్యాలనాయుడు, దయానిధి, ఎస్.రాజులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-19T04:53:46+05:30 IST