ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎస్సీ మోర్చా నేతల గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2022-05-17T06:06:23+05:30

ఈ నెల 17న విజయవాడలోని ఎస్సీ కార్పొరేషన్‌ ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు హాజరు కాకుండా నగరంలోని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలను గృహ నిర్బంధం చేశారు.

గోపాలపట్నంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకురాలు పల్లె మాధవీలత గృహ నిర్బంధం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, మే 16: ఈ నెల 17న విజయవాడలోని ఎస్సీ కార్పొరేషన్‌ ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు హాజరు కాకుండా నగరంలోని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలను గృహ నిర్బంధం చేశారు. గోపాలపట్నంకు చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర  కార్యవర్గ సభ్యురాలు పల్లె మాధవీలతను ముందస్తుగా పోలీసులు  గృహ నిర్బంధం చేశారు. ఆదివారం రాత్రి నుంచి తనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు ఆంక్షలు విధించారంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల్ని సాధించుకోవడానికి వెళ్తున్న వారిపై జగన్‌ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు.

మల్కాపురంలో

మల్కాపురం:  బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి కొక్కిలిగడ్డ విజయబాబును సోమవారం ఉదయం గాజువాక పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈసందర్భంగా విజయబాబు మాట్లాడుతూ గత మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఏ దళితుడు కూడా పైసా రుణం పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే వరకు తమ పోరాటం అగదని అన్నారు. 


Updated Date - 2022-05-17T06:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising