‘స్వచ్ఛ విశాఖ’ అంబాసిడర్గా హీరో సుమన్
ABN, First Publish Date - 2022-08-18T06:25:29+05:30
జీవీఎంసీ స్వచ్ఛ విశాఖ అంబాసిడర్గా సినీ హీరో సుమన్ వ్యవహరిస్తారని కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు.
విశాఖపట్నం, ఆగస్టు 17: జీవీఎంసీ స్వచ్ఛ విశాఖ అంబాసిడర్గా సినీ హీరో సుమన్ వ్యవహరిస్తారని కమిషనర్ డాక్టర్ లక్ష్మీషా తెలిపారు. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిషనర్ను సుమన్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కమిషనర్ చేసిన విజ్ఞప్తికి సుమన్ స్పందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హీరో సుమన్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, నగరంలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేధాన్ని వివరించినట్లు చెప్పారు.
అనంతరం సుమన్ మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ నిషేధం, ప్రత్యామ్నాయ వస్తువులను ప్రజలు స్వచ్ఛందంగా వినియోగిస్తుండడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవాలని భావించి అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ వర్మ, ప్రధాన వైద్యాఽధికారి శాస్త్రి, నిజీ ఫొటోకాన్ కరాటే స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-18T06:25:29+05:30 IST