ఘనంగా టంగుటూరి జయంతి
ABN, First Publish Date - 2022-08-24T06:19:22+05:30
స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
అనకాపల్లిఅర్బన్, ఆగస్టు 23: స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. టంగుటూరి ఫ్లెక్సీకి పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోట్ని రామకృష్ణ, కుప్పిలి జగన్, సూరె సతీష్, విల్లూరి రమణబాబు, సాలాపు నాయుడు, సాలాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తుమ్మపాల: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఏయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ అన్నారు. మంగళవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టంగుటూరి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు కొణతాల రత్నకుమారి, షరీఫ్, కావ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-24T06:19:22+05:30 IST