మహనీయుల మార్గం అనుసరణీయం
ABN, First Publish Date - 2022-10-03T06:22:45+05:30
మహనీయుల మార్గం అనుసరణీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని అన్నారు.
మహనీయుల మార్గం అనుసరణీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆదివారం జీవీఎంసీ వద్ద గల వారి విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీఎంసీ కమిషనర్ పి.రాజాబాబు, వీఎంఆర్డీఏ చైౖర్మన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, నేతలు పాల్గొన్నారు.
- సిరిపురం
Updated Date - 2022-10-03T06:22:45+05:30 IST