ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరుల త్యాగఫలమే స్వేచ్ఛా జీవనం

ABN, First Publish Date - 2022-08-15T06:06:15+05:30

ప్రస్తుతం స్వేచ్ఛా జీవనానికి అమరవీరుల త్యాగ ఫలితమే కారణమని అనకాపల్లి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ పి.కూర్మినాయుడు పేర్కొన్నారు.

గంటందొర మనమడు బోడిదొరను సన్మానిస్తున్న పీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి హౌసింగ్‌ పీడీ కూర్మినాయుడు


కొయ్యూరు, ఆగస్టు 14: ప్రస్తుతం స్వేచ్ఛా జీవనానికి అమరవీరుల త్యాగ ఫలితమే కారణమని అనకాపల్లి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ పి.కూర్మినాయుడు పేర్కొన్నారు. మండలంలోని నడింపాలెం శివారు లంకవీధిలో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుడు, అల్లూరి అనుచరుడు గాం గంటందొర మనువడు బోడిదొరను ఆదివారం కలసి ఘనంగా సత్కరించారు. అనంతరం వారి కుటుంబ స్థితిగతులను తెలుసుకుని ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించేందుకు ప్రాణాలు త్యాగం చేసిన యోధులను, వారి కుటుంబాలను మరచిపోకూడదన్నారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ఆగడాలను అడ్డుకునేందుకు పోరాడిన గంటందొర, మల్లుదొరలకు అందరూ రుణపడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎంపీడీవో ఎస్‌.డేవిడ్‌రాజు, పంచాయతీ విస్తరణాధికారి రఘురాం, హౌసింగ్‌ ఏఈ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T06:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising