ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు

ABN, First Publish Date - 2022-01-18T04:37:22+05:30

ఈ- బోనంగి రెవెన్యూ పరిధి ఇండస్ట్రీయల్‌ పార్కులోని ఖాళీ ప్రదేశంలో గుట్టు చప్పుడు కాకుండా పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో సోమవారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దట్టంగా ఎగసిన పొగ

ఆందోళన చెందిన స్థానికులు

పరవాడ, జనవరి 17: ఈ- బోనంగి రెవెన్యూ పరిధి ఇండస్ట్రీయల్‌ పార్కులోని ఖాళీ ప్రదేశంలో గుట్టు చప్పుడు కాకుండా పరిశ్రమల వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో సోమవారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.  ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలకు నిప్పు పెట్టి అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు నల్లటి దట్టమైన పొగ కమ్మేసింది. దీనికి తోడు భరించలేని దుర్వాసన వెదజల్లింది. విషతుల్యమైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను దగ్ధం చేయడంతో వాసన భరించలేక పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాంకీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏపీఐఐసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు వ్యర్థాలను తరచూ ఇక్కడే పడవేసి నిప్పు పెట్టిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వ్యర్థాలను ఇష్టానుసారంగా పడవేసి కాలుష్యానికి కారణమవుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సీటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాఽధ్యులపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.


Updated Date - 2022-01-18T04:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising