ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీటి బావిలో పడి రైతు మృతి

ABN, First Publish Date - 2022-08-11T06:46:57+05:30

ప్రమాదవశాత్తు సాగునీటి బావిలో పడి రైతు మృతి చెందిన సంఘటన అనకాపల్లి మండలం మామడిపాలెంలో చోటుచేసుకుంది.

మృతి చెందిన పీలా రామఅప్పలనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూరు, ఆగస్టు 10 : ప్రమాదవశాత్తు సాగునీటి బావిలో పడి రైతు మృతి చెందిన సంఘటన అనకాపల్లి మండలం మామడిపాలెంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రూరల్‌ పోలీసు స్టేషన్‌ హెచ్‌సీ సత్యనారాయణ తెలిపిన వివరాలివి. మామిడిపాలెం గ్రామానికి చెందిన పీలా రామఅప్పలనాయుడు (38) రోజూ మాదిరిగానే మంగళవారం ఆవులను మేతకు తీసుకు వెళ్లాడు. సాయంత్రమైనా అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో గ్రామంలో, వ్యవసాయ పొలాల్లో వెతకసాగారు. బుధవారం తెల్లవారు జామున రాజుగారి కోనేరులో ఉన్న సాగునీటి బావిలో రామఅప్పలనాయుడు మృతదేహం తేలింది. ఇది గుర్తించిన రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో భార్య లక్ష్మి   ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయి ఉంటాడని బంధువులు చెబుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

Updated Date - 2022-08-11T06:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising