సెల్ఫీ హాజరుపై ఎంఈవోకు ఫ్యాప్టో నేతల వినతి
ABN, First Publish Date - 2022-08-19T06:39:44+05:30
ఉపాధ్యాయుల సెల్ఫీ హాజరు సమస్యపై ఫ్యాప్టో నేతలు గురువారం స్థానిక ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు.
పాడేరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సెల్ఫీ హాజరు సమస్యపై ఫ్యాప్టో నేతలు గురువారం స్థానిక ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. సెల్ఫీ హాజరు వేసుకునేందుకు తమకు ప్రభుత్వం ప్రత్యేకంగా సెల్ ఫోన్లు ఇవ్వాలని, ప్రతి పాఠశాలలో నెట్వర్క్ సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నేతలు ఆర్.జగన్మోహనరావు, కె.పోతురాజు, జి.వరలక్ష్మి, ఎం.జాన్, సీహెచ్.నాగేశ్వరరావు, సీహెచ్.ఆదినారాయణ, బి.సోంబాబు, పి.బాబురావు, ఎం.కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-19T06:39:44+05:30 IST