ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: దువ్వాడ రైల్వేస్టేషన్‌ ఘటన.. విద్యార్థిని శశికళ మృతి

ABN, First Publish Date - 2022-12-08T16:05:48+05:30

విశాఖ (Visakha): దువ్వాడ (Duvvada) స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న శశికళ అనే విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Visakha): దువ్వాడ (Duvvada) స్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న శశికళ అనే విద్యార్థిని చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. నిన్న (బుధవారం) విద్యార్థిని దువ్వాడ రైల్వేస్టేషన్‌‌లో ట్రైన్ దిగితూ జారిపడి రైలు-ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. బయటకు తీసిన రైల్వే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం షీలానగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అవయవాలు దెబ్బతినడంతో మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

విద్యార్థిని శశికళ అన్నవరం నుంచి ప్రతిరోజు విశాఖ, దువ్వాడలో ఉన్న విజ్ఞాన కాలేజీకి వస్తుంది. బుధవారం కూడా గుంటూరు (Guntur)-రాయగఢ (Rayagada) ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఆమె దువ్వాడ రైల్వే స్టేషన్‌లో రైలు దిగుతుండగా కాలుజారి రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. దీంతో రైల్వే సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి గంటకుపైగా శ్రమించి ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది.

Updated Date - 2022-12-08T16:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising