ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం చెల్లించే వరకూ పనులు వద్దు

ABN, First Publish Date - 2022-08-10T06:16:39+05:30

మండలంలోని వేంపాడు రెవెన్యూ మూలపర్ర గ్రామంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటులో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని, తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకూ ఈ నిర్మాణాలను ఆపాలని కారిడార్‌ నిర్వాసిత రైతులు అల్టిమేటమ్‌ జారీ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- ఇండస్ర్టియల్‌ కారిడార్‌ నిర్వాసితులు స్పష్టీకరణ

నక్కపల్లి, ఆగస్టు 9 : మండలంలోని వేంపాడు రెవెన్యూ మూలపర్ర గ్రామంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ఏర్పాటులో భాగంగా ఏపీఐఐసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని, తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకూ ఈ నిర్మాణాలను ఆపాలని కారిడార్‌ నిర్వాసిత రైతులు అల్టిమేటమ్‌ జారీ చేశారు.  మూలపర్రలో పలువురు నిర్వాసిత రైతులు  మంగళవారం సమావేశమయ్యారు. భూములు కోల్పోయిన డి.పట్టాదారులు, సాగుదారులకు ఇంకా కొంతమంది పరిహారం ఇవ్వలేదని చెప్పారు.  వారందరికీ పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించే వరకూ కారిడార్‌ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు.  రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, అమలాపురం ఉప సర్పంచ్‌ గంటా నర్సింగరావు, సూరకాసుల గోవిందరావు, సూర కాసుల అప్పారావు తదితరులు మాట్లాడుతూ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం, ప్యాకేజీ, పునరావాస సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిబంధనలు పాటించకుండా భూముల్లోకి చొరబడి నిర్మాణాలు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడపా బాబూరావు, అడపా సత్తిబాబు, గోవింద్‌, గంటా అప్పారావు, శ్రీను, అడపా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T06:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising