ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Death mystery: విశాఖలో సంచలనం రేపిన మిస్టరీ డెత్

ABN, First Publish Date - 2022-07-21T22:04:58+05:30

ప్రియుడి మోజులోపడి కట్టుకున్న భర్తనే ఆమె కడతేర్చింది. పైగా భర్త కనిపించడంలేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Visakha): ప్రియుడి మోజులోపడి కట్టుకున్న భర్తనే ఆమె కడతేర్చింది. పైగా భర్త కనిపించడంలేదని పోలీస్ స్టేషన్‌ (Police Station)లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. విశాఖలో సంచలనం రేపిన అనుమానస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. జాతీయ రహదారి మారికవలస రైల్వే బ్రిడ్జి (Railway Bridge) కింద గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహం కేసు మిస్టరీ (mystery) వీడింది. కొద్ది రోజుల క్రితం పీఎం పాలెం పోలీస్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ కేసులోని వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి ఒక్కరేనని పోలీసులు తేల్చారు.


పూర్తి వివరాలు...

మధురవాడ (Madhurawada) ప్రాంతానికి చెందిన మృదుల భర్త ప్రొఫెసర్ మురళీని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10 రోజుల క్రితమే భర్తను హతమార్చిన భార్య ఏమీ ఎరగనట్టు తన భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మిస్టరీని ఛేదించారు... మృదుల భర్త సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 9న ఆయన విశాఖ వచ్చారు. అదే రోజు తల్లి వద్దకు వెళతానని చెప్పి వెళ్లారని... ఆ తర్వాత కనిపించడంలేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.


మిస్పింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృదుల, ఆమె ప్రియుడు శంకర్‌ కలిసి మురళిని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్దారించారు. మారికవలస రైల్వే బ్రిడ్జికింద కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. దీంతో మృదుల, ఆమె ప్రియుడు శంకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-07-21T22:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising