ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలి

ABN, First Publish Date - 2022-01-20T06:13:53+05:30

మండలంలో చిలకలగెడ్డ నుంచి పసిని, మర్రివలస గ్రామాలకు వెళ్లే మార్గంలో జీలుగులుపాడు వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలంటూ జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం ఆందోళన చేశారు.

గెడ్డలో నిరసన తెలుపుతున్న జడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆధ్వర్యంలో ఆందోళన


అనంతగిరి రూరల్‌, జనవరి 19: మండలంలో చిలకలగెడ్డ నుంచి పసిని, మర్రివలస గ్రామాలకు వెళ్లే మార్గంలో జీలుగులుపాడు వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలంటూ జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు ఆధ్వర్యంలో స్థానికులు బుధవారం ఆందోళన చేశారు. వంతెన నిర్మాణానికి రూ.2.4 కోట్లు మంజూరైనట్టు ఇటీవల అధికారులు వెల్లడించారని, కానీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదని అన్నారు. వెంటనే టెండరు ప్రక్రియ పూర్తిచేసి వర్షాకాలం వచ్చేలాగా పనులు పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చిలకలగెడ్డ సర్పంచ్‌ అప్పారావు, రొంపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు గంగులు, సీపీఎం నాయకులు నాగులు, సింగులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T06:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising