ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీడీఏ పీవో తీరుపై ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-08-15T06:07:11+05:30

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తీరు బాగులేదని ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు జంపరంగి లిల్లీ, వైసీపీ విద్యార్థి విభాగం నేత టి.సురేశ్‌కుమార్‌ ఆరోపించారు.

రవిబాబుకు ఫిర్యాదు చేస్తున్న కమిషన్‌ సభ్యురాలు లిల్లీ, వైసీపీ నేత సురేశ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ తీరు బాగులేదని ఎస్టీ కమిషన్‌ సభ్యురాలు జంపరంగి లిల్లీ, వైసీపీ విద్యార్థి విభాగం నేత టి.సురేశ్‌కుమార్‌ ఆరోపించారు. ఈ మేరకు ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబును ఆదివారం విశాఖపట్నంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ పీవో గిరిజనాభివృద్ధికి ఎటువంటి కృషి చేయకపోగా, గిరిజనుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం నిధులను తన సొంతానికి వ్యయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని  ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తీవ్రమైన అవినీతి ఆరోపణులు ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని తన సీసీగా కొనసాగించడం, ఇతర ఆరోపణల నేపథ్యంలో పీవో గోపాలక్రిష్ణను సరెండర్‌ చేయాలని, సీఐడీ విభాగంతో విచారణ జరిపించాలని వారు కోరారు.

Updated Date - 2022-08-15T06:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising