సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయండి
ABN, First Publish Date - 2022-12-07T00:32:52+05:30
ఈనెల 18, 19 తేదీలలో అనకాపల్లిలో నిర్వహించనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు గూనూరు వరలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
చోడవరం, డిసెంబరు 6: ఈనెల 18, 19 తేదీలలో అనకాపల్లిలో నిర్వహించనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు గూనూరు వరలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఆమె సీఐటీయూ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. కార్మిక చట్టాల అమలు, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై ఈ మహాసభల్లో చర్చించనున్నారన్నారు. కార్యక్రమంలో ఎండీఎం నాయకులు బుచ్చిరాజమ్మ, లక్ష్మి, రాము, వెంకటలక్ష్మి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:32:54+05:30 IST