బాదుడు పోవాలంటే చంద్రబాబు రావాలి
ABN, First Publish Date - 2022-05-17T06:45:58+05:30
ప్రజలపై బాదుడు పోవాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.
టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు నాగజగదీశ్వరరావు
మునగపాక, మే 16: ప్రజలపై బాదుడు పోవాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. నాగవరం, మల్లవరం, నారాయుడుపాలెం గ్రామాల్లో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాగడాల ప్రదర్శన చేశారు. అనంతరం బుద్ద మాట్లాడుతూ, ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మానవత్వం లేకుండా సీఎం జగన్ విపరీతంగా పన్నులు, ధరల భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపి ఇబ్బందుల పాలుచేస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై తీవ్ర భారాలు వేయడమే కాకుండా విద్యుత్ కోతలతో ప్రజలను హింసిస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు, నాయకులు మళ్ల రాజేశ్, దాడి ముసిలినాయుడు, మొల్లేటి సత్యనారాయణ, పాలిపిని అప్పారావు, పాలిపిని సంజీవి, కరణం అప్పారావు, ఇందల రమణబాబు, పొడుగు లక్ష్మణరావు, నవీన్, దాడి శివ, దొడ్డి రమేశ్, పొలమరశెట్టి మురళీ, ఆడారి గోవింద, సూరిశెట్టి రాము పాల్గొన్నారు.
Updated Date - 2022-05-17T06:45:58+05:30 IST