ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడివాడలో కేసినోపై సీబీఐ విచారణ చేపట్టాలి

ABN, First Publish Date - 2022-01-20T06:26:10+05:30

గుడివాడలో సంక్రాంతి కేసినోపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


అనకాపల్లి, జనవరి 19: గుడివాడలో సంక్రాంతి కేసినోపై సీబీఐతో విచారణ చేపట్టాలని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడి పందేలకు పర్మిషన్‌ లేదని, క్లబ్‌లు మూసేశామని, ఆన్‌లైన్‌ రమ్మి ఆట కట్టించేశామంటూ హరికథలు చెప్పిన బూతుల మంత్రి కొడాలి నాని, స్వయంగా దగ్గరుండి అసాంఘిక కార్యకలాపాలకు తెరతీయడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకలు, రంగవల్లులు, పాడి పంటలతో కళకళలాడిన ఆంధ్రప్రదేశ్‌, జగన్‌రెడ్డి హయాంలో కేసినోలు, చీర్‌గర్ల్సకు వేదికగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని వెంట నాయకులు డాక్టర్‌ నారాయణరావు, వెంకటరావు, ధనాల విష్ణుచౌదరి ఉన్నారు.


Updated Date - 2022-01-20T06:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising