ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొజ్జన్నకొండ రహదారిపై నిర్లక్ష్యం తగదు

ABN, First Publish Date - 2022-07-18T06:29:38+05:30

బొజ్జన్నకొండ రహదారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

బొజ్జన్నకొండ రోడ్డులోని గోతుల వద్ద నిరసన తెలియజేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద, టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్సీ బుద్ద

తుమ్మపాల, జూలై 17: బొజ్జన్నకొండ రహదారిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. ఆదివారం శంకరం - బొజ్జన్నకొండ  రోడ్డులో గల గోతుల్లో నిలిచిన వర్షపునీటిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి గాలాలతో చేపలు పడుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ శతాబ్దం నాటి అవశేషాలున్న బొజ్జన్నకొండపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జూలై 15 నాటికి రాష్ట్రంలో మరమ్మతులకు గురైన రోడ్లన్నీ బాగు చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారని, కానీ ఏ రోడ్డు నిర్మాణం చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుడాల సత్యనారాయణ, పూడి త్రినాథ్‌, మళ్ల గణేష్‌, బొడ్డేడ మురళి, బుద్ద భువనేశ్వరరావు, కాండ్రేగుల ముకుంద, అండిబోయిన శేషు, బీవీవీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-18T06:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising