CM Ramesh: జగన్ నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది
ABN, First Publish Date - 2022-09-23T17:32:58+05:30
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రశాంత ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు (YCP Leaders) పూర్తిగా చెడగొట్టారని.... హత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ల్యాండ్, డ్రగ్స్, గంజాయి మాఫియా పెరిగిపోతున్నాయన్నారు. వైసీపీ నేతలు అండదండలతోనే జరుగుతోందని ఆరోపించారు. అధికారికంగా గుట్కా ని నిషేధించి.. అనధికారికంగా వైసీపీ నేతలు గుట్కాని అమ్ముతున్నారని అన్నారు. ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి.. 100 రూపాయలు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు. రుషికొండ, విశాఖను ఏమి చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి మూడు సీట్లు కూడా రావని బీజేపీ ఎంపీ (BJP MP) సీఎం రమేష్ అన్నారు.
Updated Date - 2022-09-23T17:32:58+05:30 IST