Vishnukumar raju: దసపల్లా భూకుంభకోణం రూ.2 వేల కోట్లు కాదు... రూ.4 వేల కోట్లు
ABN, First Publish Date - 2022-09-30T18:40:15+05:30
దసపల్లా భూకుంభకోణం రూ.2 వేల కోట్లు కాదని...రూ.4 వేల కోట్లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు.
విశాఖపట్నం: దసపల్లా భూకుంభకోణం రూ.2 వేల కోట్లు కాదని... రూ.4 వేల కోట్లని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు (Vishnukumar raju) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము తప్పని సరిగా అధికారంలోకి వస్తాం.. వచ్చిన తర్వాత అక్రమమని తేలితే ట్విన్ టవర్స్లా కూల్చేస్తాం’’ అని హెచ్చరించారు. జగన్ (YS jagan mohan reddy)కు దమ్ము, ధైర్యం ఉంటే... సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈసీ (EC) వద్దని చెప్పినా ఓటర్లు నమోదులో గ్రామ వాలంటీర్లు పాల్గొంటున్నారని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. రైల్వే జోన్ (Railway zone) విషయంలో బీజేపీ (BJP) అన్యాయం చేస్తుందని పిచ్చి, పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. త్వరలోనే రైల్వే జోన్కు శంకుస్థాపన చేస్తామని విష్ణుకుమార్ రాజు (BJP Leader) స్పష్టం చేశారు.
Updated Date - 2022-09-30T18:40:15+05:30 IST