ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సర్వే వేగవంతం

ABN, First Publish Date - 2022-09-29T06:24:01+05:30

సమగ్ర భూ రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ కల్పనాకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతుల సందేహాలను నివృత్తి చేయాలి

అధికారులకు జేసీ కల్పనాకుమారి ఆదేశం

అనకాపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సమగ్ర భూ రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, భూ రికార్డులను సవరించి రైతులకు స్పష్టమైన సరిహద్దులు తెలియజేయాలని చెప్పారు. సర్వే జరగడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ వెంకటరమణ, అనకాపల్లి ఆర్డీఓ చిన్నికృష్ణ, నర్సీపట్నం ఆర్డీఓ భవానీ శంకర్‌, అన్ని మండలాల తహసీల్దార్లు, వీఆర్‌ఓలు, సర్వేయర్‌లు పాల్గొన్నారు.

అంతకు ముందు నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై పెట్రో కారిడార్‌ కోసం కాగిత గ్రామం నుంచి అమలాపురం వరకు నిర్మించనున్న రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు జాయింట్‌ కలెక్టర్‌ను కలిశారు. ఎకరానికి రూ.80 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత ఎక్కువ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. 


Updated Date - 2022-09-29T06:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising