నేడు బీచ్ల క్లీనింగ్
ABN, First Publish Date - 2022-05-15T06:31:04+05:30
నగరంలో బీచ్లను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సముద్ర కాలుష్యాన్ని తగ్గించవచ్చునని అధికార యంత్రాంగం భావిస్తోంది.
విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): నగరంలో బీచ్లను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సముద్ర కాలుష్యాన్ని తగ్గించవచ్చునని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై నెలలో ఒకటి, రెండు రోజులు బీచ్ క్లీనింగ్ చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆర్కే బీచ్తో పాటు పెదజాలరిపేట, జోడుగుళ్లపాలెం వద్ద బీచ్లను శుభ్రపరచడానికి కార్యక్రమం రూపొందించారు. ఇందులో నగరవాసులు, ఉద్యోగులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Updated Date - 2022-05-15T06:31:04+05:30 IST