ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులు

ABN, First Publish Date - 2022-10-05T05:50:21+05:30

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 11 పతకాలు కైవసం చేసుకోగా వీటిలో ఏడు బంగారు పతకాలు వున్నాయి. నెల్లూరులో గత నెల 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 4వ ఏపీ తైక్వాండో పోటీలు జరిగాయి.

బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏడు బంగారు, రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు

ఎలమంచిలి, అక్టోబరు 4: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 11 పతకాలు కైవసం చేసుకోగా వీటిలో ఏడు బంగారు పతకాలు వున్నాయి. నెల్లూరులో గత నెల 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 4వ ఏపీ తైక్వాండో పోటీలు జరిగాయి. ఎలమంచిలి నుంచి 14 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సబ్‌ జూనియర్స్‌ బాలికల విభాగంలో ఎం.హర్షిత, జూనియర్స్‌ విభాగంలో తుంపాల శ్వేత, రొట్టా పల్లవి, ఉండా జయశ్రీ, ఉండా మౌనిక, బాలుర విభాగంలో నగిరెడ్డి మోహిత్‌, ఆర్‌.విష్ణువర్దన్‌ బంగారు పతకాలు సాధించారు. ఎల్‌.లహరి, వి.నంద కృష్ణ రజత పతకాలు, వై.జశ్వంత్‌, వి.సౌజన్య కాంస్య పతకాలు పొందారు. పోటీల్లో 14 మంది క్రీడాకారులు పాల్గొనగా 11 మంది పతకాలు సాధించారని తైక్వాండో జిల్లా కోచ్‌ నగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. 


Updated Date - 2022-10-05T05:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising