ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు

ABN, First Publish Date - 2022-07-07T06:17:58+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు హుండీలలో సమర్పించిన మొక్కుబడులు, కానుకల ద్వారా సుమారు రూ.1.06 కోట్లు ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, దేవదాయశాఖ అధికారులు ఏఎస్‌ఎన్‌ మూర్తి, వంసత్‌ పర్యవేక్షణలో బుధవారం ఆలయ బేడామండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు.

ఆదాయం లెక్కిస్తున్న స్వచ్ఛంద సేవకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, జూలై 6: వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు హుండీలలో సమర్పించిన మొక్కుబడులు, కానుకల ద్వారా సుమారు రూ.1.06 కోట్లు ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, దేవదాయశాఖ అధికారులు ఏఎస్‌ఎన్‌ మూర్తి, వంసత్‌ పర్యవేక్షణలో బుధవారం ఆలయ బేడామండపంలో  హుండీల లెక్కింపు చేపట్టారు.  గడచిన 33 రోజుల్లో రూ.1,06,96,264 నగదు, 140.2గ్రాముల స్వర్ణం, 7.9 కిలోల రజితం ఆభరణాల రూపంలో భక్తులు సమర్పించారు. వాటితో పాటు యూఎస్‌ఏకు చెందిన 485 డాలర్లు, యుఏఈకి చెందిన 2600 దీరమ్స్‌, సౌత్‌ ఆఫ్రికాకు చెందిన 50 రేండ్స్‌, సింగపూర్‌కు చెందిన 52 డాలర్లు, మలేషియాకు చెందిన 58 రింగిట్స్‌, ఇంగ్లాండ్‌కు చెందిన పది పౌండ్లు, ఐరోపాకు చెందిన పది యూరోలు, ఆస్ట్రేలియాకు చెందిన 20 డాలర్లు, ఖజానాకు లభించింది. హుండీల లెక్కింపులో దేవస్థానం ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, శ్రీహరి సేవా సత్సంఘ్‌, ఎస్‌వీఎల్‌ఎన్‌ వాకర్స్‌ క్లబ్‌ సేవకులు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-07-07T06:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising