AP News: సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
ABN, First Publish Date - 2022-09-25T03:09:30+05:30
Vishakapatnam: విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ హాజరయ్యారు. నగరంలో పెరుగుతోన్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని
Vishakapatnam: విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్.శ్రీకాంత్ హాజరయ్యారు. నగరంలో పెరుగుతోన్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఫర్మ్ నేమ్తో ఫేక్ అకౌంట్స్ తెరిచి మోసం చేసిన ఉదంతాలను ఆయన వివరించారు. కంపెనీలకు సైబర్ ఆడిట్ కూడా తప్పనిసరిగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల్లో దర్యాప్తు క్లిష్టతరమని, కేవలం అకౌంట్లు ఫ్రీజ్ చేసి ఆపడం ఒక్కటే సాధ్యమని చెప్పారు. పిల్లలు సైబర్ నేరాలకు గురికాకుండా కాపాడుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
Updated Date - 2022-09-25T03:09:30+05:30 IST