ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత వ్యతిరేక విధానాలు నశించాలి

ABN, First Publish Date - 2022-10-03T06:05:23+05:30

దళిత వ్యతిరేక విధానాలు నశించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర ఉపాధ్యక్షుడు వై.రాజు డిమాండ్‌ చేశారు.

నిరసన వ్యక్తం చేస్తున్న కేవీపీఎస్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాబాగార్డెన్స్‌, అక్టోబరు 2 : దళిత వ్యతిరేక విధానాలు నశించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర ఉపాధ్యక్షుడు వై.రాజు డిమాండ్‌ చేశారు. కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌, గాంధీ ఆశయాలకు అనుగుణంగా కేవీపీఎస్‌ పోరాడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, బడుగు, బలహీనవర్గాలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.సుబ్బారావు, విజయ, చంద్రశేఖర్‌, పాండే, సంతోశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T06:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising