AP News: విశాఖే పరిపాలన రాజధాని : మంత్రి రోజా
ABN, First Publish Date - 2022-09-25T19:26:51+05:30
Vishakapatnam: విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసి తీరుతామని మంత్రి రోజా కీలక ప్రకటన చేశారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తర్వాత రోజా మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెం
Vishakapatnam: విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసి తీరుతామని మంత్రి రోజా కీలక ప్రకటన చేశారు. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తర్వాత రోజా మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావిస్తుంటే..చంద్రబాబు రైతుల పేరుతో దొంగ పాదయాత్రలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఎన్. టి.రామారావును వెన్నుపోటు పొడిచి...పార్టీని హస్తగతం చేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడిది కాదా? అని ప్రశ్నించారు.
Updated Date - 2022-09-25T19:26:51+05:30 IST