ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూకాంబిక ఆలయం అభివృద్ధికి చర్యలు

ABN, First Publish Date - 2022-10-07T06:26:21+05:30

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత అనకాపల్లి నూకాంబిక ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విజయ దశమిని పురస్కరించుకుని బుధవారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రూ.ఏడు న్నర కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు.

నూకాంబికను దర్శించుకుంటున్న మంత్రి అమర్‌నాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లిటౌన్‌,  అక్టోబరు 6: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత అనకాపల్లి  నూకాంబిక ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. విజయ దశమిని పురస్కరించుకుని బుధవారం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రూ.ఏడు న్నర కోట్లతో అభివృద్ధి పనులు జరగనున్నాయన్నారు. ఇప్పటికే రూ.మూడున్నర కోట్ల అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరయ్యాయని, ప్రాకార మండపానికి సంబంధించి ఫైల్‌ పెండింగ్‌లో ఉందని చెప్పారు. అమ్మవారి జాతర సమయాల్లో ఆలయ ఆవరణలో తాటాకు పందిళ్లు కాకుండా శాశ్వత ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌, మళ్ల బుల్లిబాబు, దాడి జయవీర్‌, మందపాటి జానకిరామరాజు, పలకా రవి, దంతులూరి శ్రీధర్‌రాజు, కొణతాల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌లు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఏఎంసీ చైర్‌పర్సన్‌ పలకా యశోధ, కార్పొరేటర్‌ పీలా లక్ష్మీసౌజన్య తదితరులు వీరివెంటన ఉన్నారు. 

Updated Date - 2022-10-07T06:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising