ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ABN, First Publish Date - 2022-05-22T06:40:47+05:30

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు కారకుడనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

పి.అప్పలనర్స
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స  

పాడేరు, మే 21 (ఆంధ్రజ్యోతి): దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు కారకుడనే ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని పేర్కొంటూ, తన వాహనంలోనే అతడి మృతదేహాన్ని తీసుకువచ్చారని, కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలిందన్నారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయించారనే  కుటుంబ సభ్యుల ఆరోపణలకు బలం చేకూరుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని, మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అప్పలనర్స డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-05-22T06:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising