ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతగిరికి 22 రోడ్లు, 3 వంతెనలు మంజూరు

ABN, First Publish Date - 2022-01-28T05:23:25+05:30

కనెక్ట్‌ పాడేరు మిషన్‌ ప్రాజెక్టులో 22 రహదారులు, మూడు వంతెనలు మంజూరైనట్టు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

బోనూరు రహదారిని పరిశీలిస్తున్న గిరిజన సంక్షేమశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ 

అనంతగిరి, జనవరి 27: కనెక్ట్‌ పాడేరు మిషన్‌ ప్రాజెక్టులో 22 రహదారులు, మూడు వంతెనలు మంజూరైనట్టు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని పినకోట రహదారి నుంచి బొర్రపాలెం మీదుగా పూతికపుట్టు వరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో జరుగుతున్న రహదారి పనులను గురువారం పరిశీలించారు. రూ. 18 కోట్లతో నిర్మిస్తున్న పనులను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. మండలంలో 22 రహదారులకు రూ.19.4 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. జీలుగులుపాడు, సారవానిపాలెం, రామచంద్రాపురం గ్రామాల్లో వంతెనల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. వాలాసీ, లుంగపర్తి పంచాయతీల నుంచి అనంతగిరి మండల కేంద్రానికి రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ వంశీ జేఈఈ అప్పలనాయుడు, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ శివ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T05:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising