Visakhaలో వ్యక్తి దారుణ హత్య
ABN, First Publish Date - 2022-06-20T18:14:49+05:30
నగరంలోని సబ్బవరం జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
విశాఖపట్నం: నగరంలోని సబ్బవరం జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రక్తపుమడుగులో వ్యక్తి మృతదేహం పడిఉంది. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. హతుడు కేబుల్ ఆపరేటర్ సింహాచలంగా గుర్తించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-06-20T18:14:49+05:30 IST