Andhra news: విశాఖలో వివాహిత న్యాయపోరాటం
ABN, First Publish Date - 2022-07-25T16:28:16+05:30
నగరంలోని ఆదర్స్నగర్లో వివాహిత లీలా మాధురి తనకు న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగారు.
విశాఖపట్నం: నగరంలోని ఆదర్స్నగర్లో వివాహిత లీలా మాధురి తనకు న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగారు. గతంలో భర్త జయదీప్తో వివాదాల కారణంగా లీలా మాధురి విడిగా ఉంటున్నారు. అయితే ఈనెల 6న ఇంటికి వచ్చిన మాధురి అత్తమామలతో కలిసి ఉంటుంది. కాగా.. ఆమె ఇంటి నుండి బిడ్డను తీసుకుని బయటికి వెళ్లి వచ్చే లోపు ఇంటికి తాళం వేసి అత్తామామలు పరారయ్యాడు. రాత్రి నుండి అపార్ట్మెంట్ సెల్లార్లోనే బిడ్డతో సహా లీలా మాధురి బయటే నిద్రించింది. ఇంటిని వేరొకరికి ఇచ్చేసినట్లు అత్తమామలు నోటీస్ బోర్డ్ పెట్టి పరారయ్యారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఇంటి వద్దే లీలా మాధురి పోరాటం చేస్తోంది.
Updated Date - 2022-07-25T16:28:16+05:30 IST