ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP Leaders Harassment: వైసీపీ వేధింపులకు మరో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-09-11T22:17:14+05:30

వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైసీపీ నేతల వేధింపులకు మరో వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వైసీపీ నేతల వేధింపులకు మరో వ్యక్తి మృతి చెందాడు. విశాఖ జిల్లా (Visakha District) పెందుర్తి ముదపాకలో వైసీపీ నేతల వేధింపులతో సోమేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమేశ్వరరావు కేజీహెచ్‌ (KGH)లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు వైసీపీ నేతలు గణేష్‌, బాలచందర్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడ్రోజులు గడుస్తున్నా.. వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మృతుడు స్వగ్రామం గోవిందాపురంలో బంధువుల ఆందోళనకు దిగారు. బాధితులను పరామర్శకు వచ్చిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. 


ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. వైసీపీ నేతల (YCP Leaders) వేధింపులు భరించలేక ఆత్మహత్య  చేసుకున్నట్లు కరుణాకరన్ సూసైడ్ లెటర్ రాశాడు. వైసీపీ నేతలు కేతిరెడ్డి జగదీశ్రెడ్డి (Ketireddy jagadish reddy), సురేశ్రెడ్డి (Suresh reddy)లే కారణమని లేఖలో వెల్లడించాడు. రూ.20 లక్షల అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే మూడేళ్లుగా పట్టనివ్వడం లేదని కరుణాకర్ ఆరోపించాడు. తాను, తన తల్లి వెళ్లి వైసీపీ నేతల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదని కరుణాకర్ సూసైడ్ లేఖలో ఆవేదన చెందాడు. 


Updated Date - 2022-09-11T22:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising