ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tension condition: వినాయక మండపం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్యేకు చేదు అనుభవం

ABN, First Publish Date - 2022-09-01T03:05:19+05:30

మదనపల్లి మండలం మాలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక చవితి మండపం ఎదుట వైసీపీ నేతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నమయ్య: మదనపల్లి మండలం మాలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వినాయక చవితి (Vinayaka Chavithi)మండపం ఎదుట వైసీపీ నేతలు (Ycp Leaders) బ్యానర్లు కట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు (Tdp Followers), గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. ఈ సమయంలో వినాయకుడి దర్శనానికి మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వచ్చారు. ఎమ్మెల్యేను చూసి వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. స్థానిక టీడీపీ నాయకులపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నాయకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


అయితే ఈ ఘటనతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నవాజ్ బాషాను కదలనివ్వకుండా చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ కావచంగా నిలబడ్డారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించేంచారు. 


Updated Date - 2022-09-01T03:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising