Machilipatnamలో దొంగల చేతివాటం
ABN, First Publish Date - 2022-06-17T17:37:45+05:30
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి తెగబడ్డారు.
విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీకి తెగబడ్డారు. ఉత్సవ విగ్రహాన్ని దుండగులు మాయం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో దొంగతనంపై ఈవో ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. చివరకు దొంగను పట్టుకున్న పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2022-06-17T17:37:45+05:30 IST