ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు

ABN, First Publish Date - 2022-08-13T16:57:39+05:30

కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. అత్తిలి లో వివాహం చేసుకొని వరుడు నివాసానికి హైదరాబాద్  వెళుతుండగా ఈ ఘటన జరిగింది. పెళ్లి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్‌లో చిన్న ఆవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. క్షతగాత్రులు గాయత్రి (26), రేణుక(23), శివశంకర్(25),  సీతారావమ్మ(47),  శరత్(27)లుగా గుర్తించారు. అత్తిలిలో వధువు ఇంటి వద్ద వివాహం చేసుకొని హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-08-13T16:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising