ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

durgamma temple: రేపే మూలానక్షత్రం.. ఇంద్రకీలాద్రిపై అధికారుల అలర్ట్

ABN, First Publish Date - 2022-10-01T18:14:08+05:30

ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాలు (Devi navaratri celebrations) ఘనంగా జరుగుతున్నాయి. రేపు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దేవస్ధాన, రెవిన్యూ, పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని చూడడానికి లక్షల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి భక్తులు రానున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మను మూడులక్షల మంది భక్తులు దర్శించుకోనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లను ఉచితంగా ప్రకటించారు. పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. వీఐపీలకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఇవ్వలేమని ఇప్పటికే మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు వీఐపీలు ఇంద్రకీలాద్రికి వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. రేపటికి ఐదు లక్షల లడ్డూలను అధికారులు సిద్ధంగా ఉంచనున్నారు. 

Updated Date - 2022-10-01T18:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising