ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Durgamma temple: ‘మాకు సమాధానం చెప్పేవారే లేరా’ అంటూ దుర్గగుడిలో భక్తుడి ఆగ్రహం

ABN, First Publish Date - 2022-09-27T15:13:11+05:30

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు... అక్కడి ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు(Sherannavaratri celebrations) సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు... అక్కడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 రూపాయల టికెట్ కొనుక్కున్న భక్తులను 300 రూపాయల క్యూలైన్లలో పంపడంపై మండిపడ్డారు. తమకు సమాధానం చెప్పేవారు లేరంటూ భక్తుడు ప్రశ్నించాడు. ‘‘స్తోమత లేకపోయినా భార్య నడవలేని పరిస్థితిలో ఉండడం వల్ల 500 రూపాయలు టికెట్ కొన్నాను. 500 రూపాయలు టికెట్ వీవీఐపీ అన్నారు. తీరా చూస్తే ఆర్డిఓ ఆఫీసర్ మమ్మల్ని ఆపేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అధికారులకు సరైంది కాదు. సరైన సమాధానం చెప్పే పోలీసాఫీసర్ గానీ, అధికారులు గానీ ఈ ఆలయంలో ఎక్కడా లేరు. ఎవరికి వారు వారి వారి సొంత మనుషులను దర్శనం చేయించే పనిలో పడ్డారు. మరి సామాన్య భక్తులకు, టికెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళకి ఇన్ని తిప్పలు పెడతారా’’ అంటూ భక్తుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Updated Date - 2022-09-27T15:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising