Vijayawada: మద్యం మత్తులో తల్లి గొంతు కోసిన కొడుకు
ABN, First Publish Date - 2022-06-03T13:56:54+05:30
మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లి గొంతు కోసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.
విజయవాడ: మద్యం మత్తులో ఓ యువకుడు కన్న తల్లి గొంతు కోసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. కుందవారి కండ్రికకు చెందిన సంపత్ కుమార్ అనే యువకుడు రోజూ మద్యం సేవించి ఇంటి వస్తూ తల్లిని ఇబ్బందులకు గురిచేశాడు. ఈ క్రమంలో మద్యం తాగవద్దంటూ సంపత్ను తల్లి భారతి మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు తల్లి గొంతు కోసేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న భారతిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో నిందితుడు సంపత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - 2022-06-03T13:56:54+05:30 IST