రైతులు ఇండోర్ మీటింగ్ కూడా పెట్టుకోకూడదా?: రామకృష్ణ
ABN, First Publish Date - 2022-03-23T13:57:51+05:30
నగరంలో దాసరి భవన్ (సిపిఐ రాష్ట్ర కార్యాలయం)ను పోలీసులు దిగ్బంధించటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
విజయవాడ: నగరంలో దాసరి భవన్ (సీపీఐ రాష్ట్ర కార్యాలయం)ను పోలీసులు దిగ్బంధించటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. రైతులు ఇండోర్ మీటింగ్ కూడా పెట్టుకోకూడదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఇంతటి నిర్బంధాలు అమలు చేసేటప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎందుకని రామకృష్ణ నిలదీశారు.
Updated Date - 2022-03-23T13:57:51+05:30 IST