ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీలు ఇచ్చిన Vijayammaను తప్పించారు: జీవీరెడ్డి

ABN, First Publish Date - 2022-07-07T21:39:31+05:30

తన వెంట నడిచేవారిని సీఎం జగన్‌ (CM Jagan) నట్టేట ముంచారని టీడీపీ నేత జీవీరెడ్డి (GV Reddy) దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తన వెంట నడిచేవారిని సీఎం జగన్‌ (CM Jagan) నట్టేట ముంచారని టీడీపీ నేత జీవీరెడ్డి (GV Reddy) దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు వైఎస్ విజయమ్మ (YS Vijayamma) హామీలు ఇచ్చారని తెలిపారు. ఆ హామీలు నెరవేర్చ లేదని, హామీలు ఇచ్చిన ఆమెను తప్పించారని తప్పుబట్టారు. దీనికి వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. అక్కచెల్లెమ్మలంటూ ఆడబిడ్డలనూ ముంచేందుకు జగన్‌ వెనకాడని జీవీరెడ్డి విమర్శించారు. 


జగన్ దృష్టిలో కుటుంబీకులకు విలువ లేదని సీపీఎం నేత గఫూర్‌ విమర్శించారు. జగన్‌ను సీఎం చేసేందుకు బైబిల్ పట్టుకుని విజయమ్మ రాష్ట్రమంతా తిరిగారని గుర్తుచేశారు. తల్లిని పార్టీ నుంచి తప్పించడం దారుణమన్నారు. ఇది కృతజ్ఞతా.. కృతఘ్నతా అని గఫూర్‌ వ్యాఖ్యానించారు.


విజయమ్మను సాగనంపేందుకు జగన్ ఎత్తుగడ వేస్తున్నారు. కుటుంబ వ్యవహారాలతో విజయమ్మ హైదరాబాద్‌లో ఉంటోంది. షర్మిల పార్టీకి ఆమె పెద్దదిక్కుగా ఉన్నారు. విజయమ్మతో రాజీనామా చేయించేందుకు జగన్ ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలివిగా వైసీసీ గౌరవ అధ్యక్షురాలి స్థానం నుంచి తప్పించేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీని జగన్ సాకుగా చూపుతున్నారు. విజయమ్మనే స్వయంగా రాజీనామా చేసేలా జగన్ ఎత్తుగడ వేస్తున్నారు. విజయమ్మతో రాజీనామా చేయించేలా జగన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు విజయమ్మకు జగన్‌ నేరుగా సమాచారం ఇవ్వలేదు. లేఖ ద్వారా విజయమ్మకు తెలియజేశారు.

Updated Date - 2022-07-07T21:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising