ఉక్రెయిన్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు తెలుగు రాష్ట్రాల విద్యార్థినులు
ABN, First Publish Date - 2022-02-27T19:05:17+05:30
రాజమండ్రి ఎయిర్పోర్టుకు ఉక్రెయిన్ మెడిసిన్ విద్యార్థినులు చేరుకున్నారు. సుష్మా, సుదర్శనలను కుటుంబ సభ్యులు రిసివ్ చేసుకున్నారు.
రాజమండ్రి: రాజమండ్రి ఎయిర్పోర్టుకు ఉక్రెయిన్లో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల మెడిసిన్ విద్యార్థినులు చేరుకున్నారు. సుష్మా, సుదర్శన విద్యార్థినులను కుటుంబ సభ్యులు రిసీవ్ చేసుకున్నారు. ఉక్రెయిన్లోని వెస్ట్రన్లో యుద్ధ ప్రభావం అంతగా లేదని విద్యార్థినులు తెలిపారు. ఈస్ట్రన్ ఉక్రెయిన్లో యుద్ధ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. తాము చదువుతున్న యూనివర్సిటీ రుమేనియా బోర్డర్కు దగ్గరగా ఉండడంతో త్వరగా రాగలిగామని, ఇంకా 15 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్లో ఉండిపోయారని విద్యార్థినులు మీడియాకు తెలిపారు. సైరెన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్లో తలదాచుకున్నామని విద్యార్థినులు చెప్పారు.
Updated Date - 2022-02-27T19:05:17+05:30 IST