బారెడు పెంపు... మూరెడు తగ్గింపు: తులసిరెడ్డి
ABN, First Publish Date - 2022-05-24T08:46:48+05:30
బారెడు పెంపు... మూరెడు తగ్గింపు: తులసిరెడ్డి
వేంపల్లె, మే 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ‘బారెడు పెంపు - మూరెడు తగ్గింపు.. ఇది మోదీ కనికట్టు’ అన్నట్లుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పాలనలో కేంద్ర ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోల్ మీద రూ.9.48, డీజల్పై రూ.3.56గా ఉండేదన్నారు. మోదీ ప్రభుత్వం దీనిని రూ.33కు, రూ.31.83కు పెంచిందన్నారు.
Updated Date - 2022-05-24T08:46:48+05:30 IST