ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది సీఎం జగన్ కుసంస్కారానికి నిదర్శనం: తులసి రెడ్డి

ABN, First Publish Date - 2022-03-09T18:00:58+05:30

దివంగత రోశయ్యకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళులర్పించక పోవడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, దివంగత రోశయ్యకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంతాప తీర్మానం పెట్టకపోవడం, నివాళులర్పించక పోవడం గర్హనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి జగన్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. రోశయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎమ్మెల్సీగా, ఒక సారి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రిగా, ముఖ్య మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారన్నారు. 15సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించిన గొప్ప ఆర్థిక వేత్తని కొనియాడారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పి సంతాప తీర్మానం పెట్టాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-09T18:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising