ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

35 నిమిషాల్లోనే దొంగలను పట్టేశారు!

ABN, First Publish Date - 2022-03-07T13:40:21+05:30

తిరుమలలో భక్తుల నగదు, సెల్‌ఫోన్లు ఉన్న బ్యాగును చోరీ చేసిన ఇద్దరు దొంగలను టీటీడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమలలో భక్తుల నగదు, సెల్‌ఫోన్లు ఉన్న బ్యాగును చోరీ చేసిన ఇద్దరు దొంగలను టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన మురుగన్‌, ముస్సేన్‌ బేగ్‌ తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు పొంది.. ఆదివారం ఉదయం తిరుమలకు వచ్చారు. వీరు దర్శనానికి వెళ్లకుండా కొండపై రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో భక్తుల బ్యాగును కాజేశారు. అందులో మూడు సెల్‌ఫోన్లు, రూ.15,330 నగదు ఉన్నాయి. బ్యాగుపోయిన విషయాన్ని గుర్తించిన భక్తులు స్థానిక విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 35 నిమిషాల్లోనే తిరుపతి డౌన్‌ టోల్‌గేట్‌ వద్ద నిందితులను పట్టుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2022-03-07T13:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising