ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

ABN, First Publish Date - 2022-06-03T01:05:51+05:30

తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గడిచిన రెండు నెలల తరహాలోనే మే నెలలో కూడా ఆదాయం భారీగా లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గడిచిన రెండు నెలల తరహాలోనే మే నెలలో కూడా ఆదాయం భారీగా లభించింది. మే నెలలో 22.68 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా,  రూ.129.57 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. 29వ తేదీన అత్యధికంగా 90,885 మంది దర్శించుకోగా, 25వ తేదీన రూ.5.43 కోట్లు హుండీ ఆదాయం లభించింది. మార్చి నెలలో 19.72లక్షలమంది దర్శించుకోగా,రూ.128.61 కోట్ల ఆదాయం సమకూరింది. ఏప్రిల్‌ నెలలో 20.62 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.127.63 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. మే నెలలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. కరోనా ప్రభావం తగ్గడంతో పాటు వేసవి సెలవులు కూడా జతకావడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా  సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరిగినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-03T01:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising