AP news: ప్రైవేట్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ నిర్వాహం
ABN, First Publish Date - 2022-07-21T18:30:01+05:30
నగరంలోని ఎంఆర్ పల్లెలో గల ప్రైవేట్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
తిరుపతి: నగరంలోని ఎంఆర్ పల్లెలో గల ప్రైవేట్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ లెక్చరర్ వద్ద ఏటీఎం కార్డుతో రూ.50వేల నగదును జూనియర్ లెక్చరర్ మాయం చేశాడు. అంతేకాకుండా ఇద్దరు విద్యార్థినులు నుంచి మరో 25 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. లెక్చరర్ వ్యవహారంపై ఎంఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకుండాపోయింది. కాగా.. పారిపోయిన జూనియర్ లెక్చరర్పై ఉత్తరాంధ్రలో కేసులు ఉన్నట్లు గుర్తించారు.
Updated Date - 2022-07-21T18:30:01+05:30 IST